Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడ స్కూలు టీచరుకు - అక్కడ విద్యార్థికి కరోనా ... సర్వత్రా ఆందోళన...

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (15:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ తర్వాత తిరిగి పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా మూతపడిన పాఠశాలలు, కాలేజీల తలుపులు తెరుచుకుంటున్నాయి. తాజాగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. 
 
ఇదే ప్రకాశం జిల్లాలోని ఓ స్కూళ్లో విద్యార్థుల తల్లిదండ్రలను భయాందోళనకు నెట్టేసింది. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
 
మరోవైపు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా సుమారుగా 7 నెలల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, స్కూల్స్ తెరిచిన తొలిరోజే, ఓ విద్యార్థికి కరోనా సోకడంతో ఉత్తరాఖండ్‌లోని రాణిఖేట్ పట్టణంలో కలకలం రేపింది. ఇక్కడి ఓ పాఠశాలకు తొలిరోజు వచ్చిన విద్యార్థికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో, అతనితో పాటు గదిలో కూర్చున్న 15 మందినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
 
ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి జేసీ పాండే, పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించామని, స్కూల్ గదులు, ఆవరణను శానిటైజ్ చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3941 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments