డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ : తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (14:10 IST)
ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు వెలుగు చూడటంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా గుర్తించిన 16 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీకి శనివారం పంపారు. ఒకరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి స్విమ్స్‌, మరొకటి సీసీఎంబీకి పంపారు. 
 
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి ఆ ఏరియాలో పర్యటించి ఫీవర్‌ సర్వేపై పలు సూచనలు చేశారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వేరియంట్‌ వేగంగా విస్తరించే ల‌క్ష‌ణం ఉన్నప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
 
ఏప్రిల్, మే నెలల్లో క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి. ఈ క్ర‌మంలో డెల్టా ప్లస్ వేరియంట్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుంది. 
 
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు గుర్తించిన ప్రాంతాల్లో కఠిన కంటైన్మెంట్ ఏర్పాట్లు, కాంటాక్ట్ ట్రేసింగ్ సహా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments