Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్.. పెద్దపులి పట్టించుకోలేదు.. ఇక జూకు..?

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (15:27 IST)
నల్లమల అడవిలో ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్ అయ్యింది. పిల్లికూనల వద్దకు పెద్దపులి రాలేదు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసలిమడుగు రేంజ్ దోమకుంట ప్రాంతంలో తల్లిపులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతానికి పులికూనలు ప్రత్యేక వాహనాల్లో పులి పిల్లలను తీసుకెళ్లారు. అలా అర్థరాత్రి నల్లమల అడవిలో గంటల తరబడి తల్లిపులి కోసం 92 గంటల పాటు ఎదురుచూశారు. 
 
కానీ తల్లిపులి జాడే కనిపించలేదు. పిల్లల కోసం తల్లిపులి రాకపోవడంతో ఇక చేసేది లేక అధికారులు పులికూనలను తిరిగి ఆత్మకూరు క్యాంప్ ఆఫీసుకు తరలించారు. పాపం అమ్మపాలు తాగి అమ్మతో ఆడుకుంటూ వేట నేర్చుకోవాల్సిన పులి కూనలు అటవీశాఖ అధికారులు పెట్టింది తిని జీవిస్తున్నాయి.
 
ముసలిమడుగు గ్రామం అడవిముక్కల ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద పులి పిల్లలను శ్రీనివాస్ నేతృత్వంలో తరలించినా తల్లిపులి పిల్లల దగ్గరకు రాకపోవటంతో అధికారులు యత్నిలు ఫలించకుండాపోయాయి.  
Cubs
 
సాధారణంగా మనుషుల స్పర్శ కలిగిన పులి కూనలను తల్లి దగ్గరకు రానివ్వదు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన విషయాన్ని అటవీశాఖ అధికారులు గుర్తు చేసుకున్నారు.  పిల్లలను తల్లి పులి మళ్లీ దగ్గరకు చేర్చుకోదని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే.. జూకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments