Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధానిపై ప్రకటన : గురువారం 12.17 నిమిషాలకు...

Webdunia
బుధవారం, 3 సెప్టెంబరు 2014 (08:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రాంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అధికారపూర్వక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం మంచి శుభ ముహుర్తంలో అంటే దశమి గురువారం 12.17 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజధాని ఎంపిక ప్రాంతంపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. 
 
వాస్తవానికి ఈ సస్పెన్స్ ముందుగా అనుకున్న ప్రకారం అయితే మంగళవారమే వీడిపోవాల్సి వుంది. అయితే మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. పైగా తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇడుపులపాయకి వెళ్ళారు. ఆయన లేకుండా ప్రకటించడం భావ్యం కాదని కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు శాసనసభలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. విజయవాడ - గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments