Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:30 IST)
ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదివారం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, 23వ తేదీ మధ్యాహ్నం భారీ ర్యాలీగా కన్నా గార్డెన్ నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వెళ్లి టీడీపీ కుండవా కప్పుకోనున్నారు. 
 
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం తన అనుచరులతో ఏకంగా 4 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భవిష్యత్ ప్రణాళికతో పాటు ఏ పార్టీలో చేరితో బాగుంటుందన్న అంశాలపై తన అనుచరులను అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరాని ముక్తకంఠంతో చెప్పారు. దీంతో ఆయన టీడీపీ కండుపా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకోసం ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి తమ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తారు. ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన పలువురు నేతలు కూడా అదే రోజున టీడీపీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments