Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెజరీ ఉద్యోగులంతా ఆదివారం కూడా పనిచేయాలి : ఏపీ సర్కారు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రెజరీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఆదివారం కూడా పని చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి వేతన బిల్లులు క్లియర్ చేయాలంటూ ఆ ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు వాట్సాప్ సందేశాలను పంపించింది. అలాగే, ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులను కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 
 
కాగా, కొత్త పీఆర్సీ ప్రకారం హెచ్.ఆర్.ఏను సవరించారు. విజయాడలోని హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం పెంచారు. కాగా, ట్రెడరీ, డీడీవో సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరుక రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఉద్యోగులు ఆందోళనలకు ఉపక్రమించారు. ఫిబ్రవబరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేడుతున్న ఉద్యోగులు 7వ తేదీన నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments