Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈసారి కూడా బాలికలదే పైచేయి

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (17:27 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా తొలి సంవత్సరం 59 శాతం మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈసారి ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 
 
ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో కృష్ణాజిల్లా తొలి స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి రెండవ స్థానం, గుంటూరు మూడవ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. అయితే, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటించారు. 
 
అసలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రం కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం 5,07,228 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, అలాగే 4,88,795 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయగా.. 2,76,389 మంది పాస్ అయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments