Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈసారి కూడా బాలికలదే పైచేయి

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (17:27 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా తొలి సంవత్సరం 59 శాతం మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈసారి ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 
 
ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో కృష్ణాజిల్లా తొలి స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి రెండవ స్థానం, గుంటూరు మూడవ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. అయితే, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటించారు. 
 
అసలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రం కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం 5,07,228 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, అలాగే 4,88,795 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయగా.. 2,76,389 మంది పాస్ అయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments