Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదవ తరగతి.. పరీక్షల ఫలితాలపై హైపవర్‌ కమిటీలు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (15:49 IST)
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఎం.ఛాయారతన్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. అయితే వీరితో పాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ కమిటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది. ఇక ఇంటర్మీడియేట్‌ పరీక్ష ఫలితాలను అనుసరించాల్సిన విధి విధానాలను నిర్ణయించేందుకు ఛాయారతన్‌ నేతృత్వంలోనే మరో హైపవర్‌ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
 
కాగా, టెన్త్‌, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, కరోనా కాలంలో పరీక్షలను రద్దు చేయాలంటూ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో చివరకు పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఫలితాలను వెల్లడించేందుకు కమిటీలను నియమించింది. త్వరలోనే టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments