Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదేశాలను ధిక్కరిస్తారా? కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమరావతి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ గతంలో జారీచేసిన ఆదేశాలను ధిక్కరించి, సీఎం జగన్ సర్కారు విజిలెన్స్ కార్యాలయలను తరలించాలని జీవో జారీ చేసింది. దీనిపై తీవ్రంగా మండిపడింది. 
 
పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, మూడు రాజధానుల విధానంలో భాగంగా సీఎం జగన్ పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కర్నూలు, వైజాగ్‌లకు తరలించాలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా, విజిలెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేలా ఇటీవల అర్థరాత్రిపూట జీవో జారీచేశారు. 
 
దీనిపై  న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఇదే అంశంపై మరో రెండు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments