Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదేశాలను ధిక్కరిస్తారా? కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమరావతి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ గతంలో జారీచేసిన ఆదేశాలను ధిక్కరించి, సీఎం జగన్ సర్కారు విజిలెన్స్ కార్యాలయలను తరలించాలని జీవో జారీ చేసింది. దీనిపై తీవ్రంగా మండిపడింది. 
 
పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, మూడు రాజధానుల విధానంలో భాగంగా సీఎం జగన్ పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కర్నూలు, వైజాగ్‌లకు తరలించాలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా, విజిలెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేలా ఇటీవల అర్థరాత్రిపూట జీవో జారీచేశారు. 
 
దీనిపై  న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఇదే అంశంపై మరో రెండు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments