Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ తాయిలాలు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులపై ప్రమోషన్ అనే తాయిలం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 10వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించింది. ఇందులోభాగంగా, 4 వేలమంది ఎస్జీటీలను ఎస్ఏలుగా ప్రమోషన్ చేసింది. 
 
అలాగే,998 మంది ఎస్ఏలను ప్రిన్సిపల్ (గ్రేడ్ 2)పోస్టులకు అప్‌గ్రేడ్ చేసింది. 2342 మంది ఉపాధ్యాయ పోస్టులను మార్పిడి చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 
 
అలాగే, 52 ప్రీ స్కూళ్ళను ఉన్న పాఠశాలలుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమషనర్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమలులో భాగంగా ఈ పదోన్నతులు కల్పించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
కాగా, తమ సీపీఎస్ విధానం రద్దుతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మిలియన్ మార్చ్ పేరుతో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులతో పాటు ఏపీ ఉద్యోగులు తలపెట్టారు. దీనిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇపుడు పదోన్నతి తాయిలాలు ప్రకటించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments