Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లా మినహా... ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే, ప్రజా కార్యక్రమాల కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపువుంది. ఈ సమయాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడగించారు. ఈ మేరకు కర్ఫ్యూ వేళలను సడలిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండగా, ఈ వేళలను 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయనున్నారు.
 
అయితే, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. 
 
షాపులు, రెస్టారెంట్లు తదితరాలు సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. ప్రజారవాణాకు ఉపయోగించే బస్సులు కూడా ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు తిరగనున్నాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments