Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఔదార్యం - కారుణ్య మరణం కింద ఒకరికి ఉద్యోగం

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు ఔదార్యాన్ని చూపారు. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన శుభవార్త చెప్పారు. ముఖ్యంగా, కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నిమాయకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ ప్రక్రియను ఈ యేడాది నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధినిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. 
 
వారులేని లోటుతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలు కాకూడదని ప్రజల మనసెరిగిన ప్రభుత్వంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments