Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 3న ఏపీ మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామన్న జీఏడీ!!

ఠాగూర్
శుక్రవారం, 31 మే 2024 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇంతలోనే ఏపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిస్తుండగా, వాటిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. పైగా, జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని ప్రకటించారు. 
 
అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సీఆర్డీయే అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ అండ్ టి గోదాము నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపును సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సామాగ్రి తరలించచవద్దని స్పష్టం చేశారు. 
 
అటు జూన్ 3వ తేదీన సచివాలయంలో మంత్రుల చాంబర్లు స్వాధీనానికి జేఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ఆదేశాలు జారీచేసింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటికి తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లవద్దని పేర్కొంది. 
 
మంత్రులు పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీలు చేయాలని ఎస్పఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ మూడో తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments