Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో యజమాని మృతి .. పలకరింపుకు ఎవరూ రాలేదనీ ఫ్యామిలీ సూసైడ్...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (22:51 IST)
కరోనా వైరస్ అనే మహమ్మారి అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ వైరస్ సోకి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ అనుకున్నవారు దూరమైపోయారన్న బాధను జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా వైరస్ సోకి కుటుంబ యజమాని చనిపోయారు. ఆ కుటుంబాన్ని పలుకరించేందుకు ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మృతుని భార్య, ఇద్దరు పిల్లలు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదల గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ఈ నెల 16వ తేదీన మృతి చెందారు. 
 
ఈ విషయం తెలిసినప్పటికీ బంధువులు కానీ, స్నేహితులు కానీ మిగిలిన కుటుంబ సభ్యులను పలకరించేందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గత అర్థరాత్రి రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ముగ్గురి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments