Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒంటిపూట బడులు పొడగింపు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా బడులను ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికిగాను ఈ నెల 12వ తేదీన ఒంటిపూట బడులను పునఃప్రారంభించారు. అయితే, ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుతం ఈ ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మరోమారు ఒంటిపూట బడులను పొడగించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు. 
 
జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గక పోవడంతో తాజాగా ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడులను ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుదంని పాఠశాల విద్యాసఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments