Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒంటిపూట బడులు పొడగింపు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా బడులను ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికిగాను ఈ నెల 12వ తేదీన ఒంటిపూట బడులను పునఃప్రారంభించారు. అయితే, ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుతం ఈ ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మరోమారు ఒంటిపూట బడులను పొడగించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు. 
 
జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గక పోవడంతో తాజాగా ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడులను ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుదంని పాఠశాల విద్యాసఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments