Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌కు క్యూకట్టిన ఓటర్లు

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ళకు వచ్చిన ఓటర్లు.. పోలింగ్ ముగియడంతో తిరిగి తమ సొంతూళ్ళకు బయలుదేరారు. 
 
నిజానికి ఓట్లు వేసేందుకు రెండు రోజుల క్రితమే బయల్దేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
 
సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, టూవీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది.
 
ఓటింగ్ నేపథ్యంలో ఈరోజు సెలవుదినం ప్రకటించారు. మంగళవారం వర్కింగ్ డే కావడంతో సోమవారమే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం