Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం : రేపటి నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి జరుగనున్నాయి. మొత్తం 7902 పోస్టులకుగాను 5.89 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగనున్నాయి. ఇందుకోసం మొత్తం 124 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 
 
అయితే, టెట్ పరీక్షలో అర్హత పొందిన 18931 మంది అభ్యర్థులు డీఎస్సీ అర్హత కోల్పోయారు. దీంతో 5,89,228 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాయనున్నారు. తొలివిడతలో 24 నుంచి స్కూల్‌ అసిస్టెంట్స్‌(లాంగ్వేజెస్‌, నాన్‌ లాంగ్వేజెస్‌), పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, పండిట్‌, పీఈటీ పరీక్షలు జరుగుతాయి. వీటికి 2,43,175 మంది హాజరుకానున్నారు. రెండోదశలో జనవరి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షలకు 3,46,053 మంది హాజరుకానున్నారు.
 
డీఎస్సీ పరీక్షలు రెండు సెషన్లలో (ఉదయం 9.30-12గంటల వరకు, మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు) పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏపీలో 113, ఒడిసాలో 3, తెలంగాణలో 4, బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేంద్రాలు ఉన్నాయి. కాగా, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments