Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసారావుపేటలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసిన ప్రేమోన్మాది

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:52 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది కిరాతకుడిగా మారిపోయి, డిగ్రీ విద్యార్థిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో కోటా అనూష(20) అనే యువతి బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడుకు చెందిన అనూష రోజూ మాదిరిగానే ఇంటి నుంచి కళాశాల బస్సులో కాలేజీకి వచ్చింది. బస్సు దిగిన అనంతరం ఆమెను ప్రేమోన్మాది విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడాలని చెప్పి ఆటోలో ఎక్కించుకు వెళ్లినట్లు సహచార విద్యార్థులు చెబుతున్నారు. 
 
పట్టణ శివారులోని రావిపాడు సమీపంలోని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి అనూష గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువ ఒడ్డున పడవేసి కనిపించకుండా చెత్త కప్పాడు. 
 
అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చి తాను అనూషను హత్య చేశానని, మృతదేహం కాలువ వద్ద ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు.
 
కాగా, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించిన విష్ణు.. అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments