Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 500 దాటిన కరోనా- 24 గంటల్లో 567 కేసులు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (18:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వరకు తగ్గిన కరోనా కేసులు ప్రస్తుతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజున నాలుగు వందలకు దిగువన కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 500 దాటింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 567 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
 
దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,64,854కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఎనిమిది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,364 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4777 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 39,545 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,93,65,385 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 437 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,45,713 లక్షలకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments