Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో గర్భిణీలపై కరోనా పంజా.. ఏపీలో కోవిడ్ విజృంభణ

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (19:01 IST)
తిరుపతి నగరంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. దీంతో చాలా మంది గర్భిణీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే కరోనా సోకిన గర్భిణీలను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు.

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల వైద్యులు ఇప్పటివరకూ 70 నార్మల్, 70 సిజేరియన్ డెలివరీలు చేశారు. ప్రసవాలు చేసిన వైద్య బృందంలో ఒక గైనిక్ సర్జన్, ముగ్గురు పీజీలు, ఐదుగురు నర్సులు కోవిడ్‌కు గురయ్యారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10004 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 434771కు పెరిగింది. ప్రస్తుతం 100276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా నుంచి 330526 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3969కు చేరింది. 24 గంటల్లో 8,772 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,22,912 శాంపిల్స్‌ పరీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments