Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేస్తుండగా బెణికి కాలు.. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు బెణికింది. ఆయన వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ నెల 5వ తేదీన కర్నూలు జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవానికి ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన ప్రయాణం రద్దు చేసుకున్నారు.
 
నోప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బుధవారం ఒంటిమిట్ట ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు గతంలోనూ ఇలాగే కాలికి గాయమైన విషయం తెల్సిందే. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సివుంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, కాలు బెణకడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోగా, ఆ మేరకు అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments