Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 రోజుల్లోనే రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల్న క్లియర్ చేశాం.. బాబు

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:35 IST)
పోలీసు శాఖకు చెందిన 763 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఇకపై తమ సర్కారు క్లియర్ చేస్తుందని, 6,100 మంది కానిస్టేబుళ్లను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌సీపీ) పోలీసు శాఖకు చెందిన రూ.763 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. 
 
పోలీసు శాఖకు సహకరించేందుకు దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని పోలీసు సంస్మరణ దినోత్సవంలో భాగంగా బాబు తన ప్రసంగంలో తెలిపారు. పోలీసు శాఖలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లాంటిదని పేర్కొన్న సీఎం.. దానికి తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ సహకరిస్తున్నానని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే శాఖకు చెందిన రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులను ఇప్పటికే క్లియర్ చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం వుందని.. పోలీసులు పాత ఫ్యాషన్ సాంకేతిక సాధనాలతో నేరస్థులతో పోరాడలేరని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

మట్కా నుంచి పద్మ గా సలోని ఫస్ట్ లుక్ రిలీజ్

కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments