Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పాలన షురూ.. కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (17:59 IST)
పాలనలో తనదైన ముద్ర వేసుకోవడానికి చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. నిన్నటికి నిన్న కాబినెట్ సమావేశాన్ని పేపర్ లెస్ గా నిర్వహించిన ఆయన శనివారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సిఎంఓను పూర్తిగా పేపర్ లెస్ గా తయారు చేశారు. మొదటి దశలో భాగంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం, సిఎంవోలు పూర్తిగా కంప్యూటర్ల మీదనే నడుస్తాయి. 
 
అన్ని ఫైళ్ళను కంప్యూటర్ల ద్వారానే తెప్పించుకుని క్లియర్ చేస్తారు. జాప్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆఫీస్ ప్రాజెక్టు ద్వారా అన్ని ఫైళ్ళను డిజిటలైజ్ చేస్తారు. ఏ స్థాయిలో ఫైలు క్లియరవుతుందో ఆ స్థాయిలోని అధికారి కంప్యూటర్లోనే ముందుకు పంపాల్సి ఉంటుంది. 
 
లేదంటే తిరస్కరిస్తున్నట్లు ఫీడ్ చేయాలి. ఇలాంటి ఆప్షన్లున్న సాఫ్ట్ వేర్ తయారు చేస్తారు. ఇందులోనే అన్ని ఫైళ్ళు నడుస్తాయి. ప్రస్తుతానికి సిఎంఓ, చీఫ్ సెక్రటరీ కార్యాలయాలను డిజిటలైజ్ చేస్తారు. అనంతరం రెండో దశలో అన్ని కార్యాలయాలను ఈ కార్యాలయాలుగా మార్చుతారు. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments