Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రులందరికీ ఐ-ప్యాడ్లు... ఇకపై ఈ-క్యాబినెట్ సమావేశాలు...

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (12:55 IST)
ఎల్లవేళలా వినూత్నంగా ఆలోచన చేసే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సమావేశాల నిర్వహణపై ఆయన వైవిధ్యంగా ఆలోచన చేశారు. ఇకపై నిర్వహించే మంత్రిమండలి సమావేశాలన్నీ ఈ-క్యాబినెట్ రూపంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులందరికీ ఐప్యాడ్లు అందజేసి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ఇటీవలే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే క్యాబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. చంద్రబాబు తొలుత 2014లో ఇ-క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కనబెట్టింది.
 
క్యాబినెట్ సమావేశం అంటే చాలు... ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగిత రహిత ఇ-క్యాబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కనిపించదు. ఎంచక్కా, మంత్రుల ఐప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్ లోడ్ చేస్తారు.
 
ఈ విధమైన హైటెక్ క్యాబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, క్యాబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఇ-క్యాబినెట్ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments