Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం... నిధుల సమీకరణపై చర్చ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో జ‌రుగుతుంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా నూతన ఐటీ విధానంపై చ‌ర్చిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో అమ‌లు చేస్తోన్న‌ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల, నిధుల సమీకరణపై చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో నెల‌కొన్న‌ జల వివాదాల గురించి కూడా మంత్రుల‌తో జ‌గ‌న్మోహన్ రెడ్డి వివరంగా చ‌ర్చిస్తున్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ప్రైవేట్ వ‌ర్సిటీల నియంత్రణ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవ‌కాశం ఉంది.
 
ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆమోద ముద్ర వేయ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సాగు భూముల పంపిణీపై కూడా నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించే విష‌యంలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది.
 
టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,900 కోట్ల రుణానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రుల అభిప్రాయాల‌ను జ‌గ‌న్ తీసుకోనున్నారు. క‌రోనా నియంత్రణతో పాటు మూడో దశ వ్యాప్తి జ‌రిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల వంటి అంశాలు కూడా చ‌ర్చించే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments