Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:07 IST)
తిరుమల తిరుపతి మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. అలిపిరి - తిరుమల కాలిమార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి చిక్కినట్టు తితిదే అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నాలుగు చిరుత పులులను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను పట్టుకోగా, ఆ తర్వాత రెండు, ఇపుడు మరొక చిరుత పులిని పట్టుకున్నారు. 
 
కాగా, ఈ నాలుగో చిరుత పులిని బోనులో బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కాలి నడక మార్గంలో నడిచివెళుతున్న ఓ చిన్నారిపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. దీంతో అప్రమత్తమైన తితిదే అదికారులు కాలి నడక మార్గంలో పలు రకాలైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, మధ్యాహ్నం 2 గంటలకు పైబడి చిన్నారులు నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే, భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా తితిదే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments