Webdunia - Bharat's app for daily news and videos

Install App

తట్టాబుట్టా సర్దేయండి.. సీఆర్డీయేకు సూచన.. 26 నుంచి ప్రజావేదిక కూల్చివేత

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (14:18 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో కృష్ణానది కరకట్టను ఆనుకుని నిర్మించిన ప్రజా వేదికను ప్రభుత్వం కూల్చివేయనుంది. ఈ వేదికలో సోమవారం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు జరుగుతోంది. ఇందులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ భవనం కూల్చివేతకు ఆదేశాలు జారీచేశారు. 
 
దీంతో ప్రజా వేదికలో ఉన్న అన్ని రకాల వస్తువులను శరవేగంగా తరలించాలని సీఆర్డీయేకు రెవెన్యూ శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా వేదిక భవనంలో ఉన్న ఫర్నీచర్, ఏసీలు, ఇతరాత్రా వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న కలెక్టర్ల సదస్సు ముగియగానే కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. పరిపాలనా యంత్రాంగంతో నిర్వహించబోయే సమావేశాలకు రాజధానిలోనే వేదికను నిర్మించాలని రెవెన్యూ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలిపిన అనంతరం కొత్త వేదిక నిర్మాణం మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ప్రజావేదిక నిర్మాణంతో పాటు కరకట్టపై ఉన్న ఇతర కట్టడాలను కూడా కూల్చేస్తారా లేక ప్రజావేదిక మాత్రమే పడగొడతారా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments