Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం... బయలుదేరిన మూడు లారీలు

అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెం

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:14 IST)
అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళలోని అయిదు జిల్లాల బాధితులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందులో అలపుఝా జిల్లాలోని చెర్తాలా ప్రాంత బాధితులకు, ఎర్నాకుళంలోని ఎడతలా ప్రజలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున, పతనాతిట్టా జిల్లాలోని ఆదూర్ టౌన్‌కు 400 మెట్రిక్ టన్నులు, పతనాతిట్టా టౌన్ ప్రజలకు 100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. త్రిశూర్ జిల్లాలో త్రిశూర్ టౌన్ ప్రజలకు 400 మెట్రిక్ టన్నులు, వేనాఢ్ జిల్లాలో భేతరి టౌన్ వాసులకు 100 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. 
 
బియ్యం పంపిణీపై ఇప్పటికే కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులకు ఏపీకి చెందిన అధికారులు సమాచారమందించారు. సచివాలయం నుంచి మూడు లారీలతో బియ్యాన్ని అధికారులు పంపించారు. వాటికి సీఎం చంద్రబాబునాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments