Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్‌కు మరో షాక్.. సీపీఎస్‌ రద్దు చేయాలని రోడ్డెక్కిన..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (16:06 IST)
సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు, ధర్నాలతో ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. 
 
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకు పింఛన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీపీఎస్‌ రద్దు హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. 
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా ఎదురుచూసినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళనబాట పట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తమ ఆందోళనలను మరింతగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తొలిసారి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments