Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాచక ఆంధ్రప్రదేశ్‌: అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (08:45 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌ను సిఎం జగన్‌ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారని ఆరోపించారు.

రెండేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలే గాని ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్‌ భర్తపై వైసిపి నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్‌ తెరిచి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి బిసి నేతలే లక్ష్యంగా వైసిపి ఎంపి విజయసాయి, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.

టిడిపి జారీ చేసిన పది డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు సిఎం జగన్‌ పంగనామం పెడుతున్నారని, డీజిల్‌ ధరలు పెంపుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments