Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మా... మా నాన్న ఎవరు?' అని ప్రశ్నించిన కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:42 IST)
అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ కసాయి తల్లి దారుణానికి ఒడిగట్టింది. అమ్మా మా నాన్న ఎవరు? అని ప్రశ్నించింది. దీనికి ఆగ్రహానికి గురైన ఆ మహిళ... కన్నబిడ్డ అని కూడా చూడకుండా కర్రుతో వాతలుపెట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కదిరి పట్టణంలోని ఓ కాలనీలో ఈ ఘటనచోటుచేసుకుంది. గత కొంతకాలం క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. అనంతరం మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అప్పట్నుంచి ప్రియుడిపై మోజుతో తన చిన్నారిని ఇబ్బంది పెడుతూ వస్తోంది.
 
'అమ్మా.. మా నాన్న ఎవరు..?' అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో 'ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్' అంటూ చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments