మోదా గ్రామంలో వివాహితపై వైకాపా నేత అత్యాచారయత్నం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా, బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లాలోని పరిగి మండల పరిధి మోదా గ్రామంలో వివాహితపై వైసీపీ నేత అత్యాచారయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి మోదా గ్రామానికి ఇటీవల ఓ కుటుంబం వలస వచ్చింది. బుధవారం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మహిళపై గ్రామానికి చెందిన వైసీపీ నేత కుమారుడు అరుణ్‌కుమార్.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ కామాంధుడు నుంచి తప్పించుకునేందుకు వివాహిత బిగ్గరగా కేకలు వేసింది. ఈ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడు చేరుకుని ఇంటి తలుపులు బద్దలు కొట్టి మహిళను రక్షించారు. స్థానికులను చూడగానే అరుణ్‌కుమార్ అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments