Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక....

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (15:37 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటన ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం, సీసీకొత్తపేట బస్టాప్ వద్ద జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అంజలి అనే మహిళకు మహేంద్ర అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అయితే, అంజలికి తమ సమీప బంధువైన యోగానంద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలిసి ఇరువరిని మందలించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇకపై తామిద్దరం కలుసుకోలేమని భావించి వారిద్దరూ ఇంటి నుంచి గత శుక్రవారం పారిపోయారు. 
 
ఆ మరుసటి రోజు శనివారం సీసీకొత్తపేట బస్టాప్‌ సమీపంలో పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి వారిని ధర్మవరం దవాఖానకు తరలించగా అంజలి మృతి చెందింది. యోగానంద్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments