Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా.. ఓ టైటానిక్ నౌక.. బంగాళాఖాతంలో మునిగిపోతుంది : ఆనం జోస్యం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (18:16 IST)
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీ ఒక టైటానిక్ నౌక వంటిందని, అది త్వరలోనే బంగాళాఖాతంలో మునిగిపోతుందని టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావ వంటిదని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా చేసిన వ్యాఖ్యలపై ఆనం శుక్రవారం ఘాటుగానే స్పందించారు.
 
వైకాపా త్వరలో బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి టైటానిక్‌ షిప్‌లా తయారైందని ఎద్దేవా చేశారు. జగన్‌ పెడుతున్న ఇబ్బందుల కారణంగా వైకాపా నుంచి 10 ఎమ్మెల్యేలు త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అసాంఘిక శక్తిలా తయారవుతున్నాడని ఆనం ఆరోపించారు. 
 
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబు నాయుడికి తప్ప మరెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో ఏ క్షణంలోనైనా జగన్ జైలుకెళతారని జోస్యం చెప్పారు. ఆయనను నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునుగుతారని జగన్ అనుచరులను ఆనం హెచ్చరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments