Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిబ్బలపాలెంలో దారుణం.. బెట్టింగ్ కోసం అప్పు.. తీర్చలేక విద్యార్థి సూసైడ్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (08:50 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లా దిబ్బలపాలెంలో దారుణం జరిగింది. క్రికెట్‌లో బెట్టింగులు పెట్టేందుకు ఒక విద్యార్థి భారీగా అప్పులు చేశాడు. వాటిని తిరిగి తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎలుకలు మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని దిబ్బలపాలెంకు చెందిన పెంటకోట మధుకుమార్ (20) అనే యువకుడు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన మధు కుమార్ ఐపీఎల్‌లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
మరోవైపు మధుకుమార్‌కు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఈ నెల 23 తేదీ రాత్రి మధు కుమార్ ఎలుకల మందు సేవించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments