Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై గాయత్రిదేవిగా అమ్మవారు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (08:16 IST)
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం సకల మంత్రాలకు మూలమైన గాయత్రిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారు వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంగా దర్శనమిస్తున్నారు.

భక్తులు గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మ సాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవతగా భాసిల్లుతున్నాడు.

గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments