Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయ్ : బుద్ధా వెంకన్న

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:55 IST)
'రావాలి జగన్.. కావాలి జగన్' అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. అక్రమాస్తుల కేసులో నాంపప్లి సీబీఐ కోర్టుకు జగన్ శుక్రవారం వ్యక్తిగతంగా హాజరైన విషయం తెల్సిందే. ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడుగా ఉన్నారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్... నేరుగా కోర్టు బోనులో నిలబడి చేతులు కట్టుకుని నిల్చొన్నారంటూ బుద్ధా వెంకన్న చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"జగన్మోహన్ రెడ్డిగారూ.. మీరు కోర్టుకు హాజరై జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్‌లో చాలా కష్టపడుతున్నారు. రూ.60 లక్షలు ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇపుడు ఖర్చు ఎంత చూపిస్తారు.? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్.. కావాలి జగన్ అని సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments