Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ద్రోహి ఎమ్మెల్యే బాలకృష్ణ - హీరోకు చేదు అనుభవం

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆ పార్టీ తరపున అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటుడు బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ద్రోహి అంటూ వైకాపా కార్యకర్తలు, నేతలు నినాదాలు చేస్తూ బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. 
 
తన సొంత నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు... అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంట, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
కాగా, గత కొన్ని రోజులుగా రాజధాని కోసం తమ భూములు ఉచితంగా ఇచ్చిన రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన చేస్తున్న రైతులకు వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments