Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amaravati: అందుకే మూడు రాజధానులు.. అమరావతి శ్మశానంలా ఉందని చెప్పిన మాట నిజమే

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (19:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ఆయన పేర్కొన్నారు. తమ అధికారంలో ఉన్న సమయంలో, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఇంత భారీ బడ్జెట్‌ను కేటాయించే ఆర్థిక సామర్థ్యం లేదని, అందుకే వారు మూడు రాజధానుల ప్రతిపాదనను ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
 
అమరావతి శ్మశానంలా ఉందని గతంలో తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనన్న బొత్స, ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడానని అన్నారు. టీడీపీ హయాంలో అమరావతి కోసం రూ.6000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని దీంతో అమరావతి వల్లకాడులా మారిందని అన్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడానని బొత్స న్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, అధికార పార్టీకే పని చేయాలని సాక్షాత్తూ సీఎం మాట్లాడటం సరైంది కాదని బొత్స అన్నారు. 
 
రుషికొండలో అవినీతి జరిగిందని అంటున్నారని మరి అలాంటప్పుడు రుషికొండ భవనం కట్టిన కాంట్రాక్టర్​కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుషికొండలో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలని బొత్స డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments