Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amaravati: అందుకే మూడు రాజధానులు.. అమరావతి శ్మశానంలా ఉందని చెప్పిన మాట నిజమే

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (19:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ఆయన పేర్కొన్నారు. తమ అధికారంలో ఉన్న సమయంలో, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఇంత భారీ బడ్జెట్‌ను కేటాయించే ఆర్థిక సామర్థ్యం లేదని, అందుకే వారు మూడు రాజధానుల ప్రతిపాదనను ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
 
అమరావతి శ్మశానంలా ఉందని గతంలో తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనన్న బొత్స, ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడానని అన్నారు. టీడీపీ హయాంలో అమరావతి కోసం రూ.6000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని దీంతో అమరావతి వల్లకాడులా మారిందని అన్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడానని బొత్స న్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, అధికార పార్టీకే పని చేయాలని సాక్షాత్తూ సీఎం మాట్లాడటం సరైంది కాదని బొత్స అన్నారు. 
 
రుషికొండలో అవినీతి జరిగిందని అంటున్నారని మరి అలాంటప్పుడు రుషికొండ భవనం కట్టిన కాంట్రాక్టర్​కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుషికొండలో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలని బొత్స డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments