Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు ఉందా? లేదా? మంత్రి పెద్దిరెడ్డి స్పందన ఏంటి?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (08:55 IST)
అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలింపు ప్రక్రియపై ఏపీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు ప్రక్రియ సాధ్యపడక పోవచ్చని వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. జూలై నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మరోవైపు, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం వెనుక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తముందని ఆయన ఆరోపించారు. చంద్రబాబే రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తున్న విషయం అందరికీ తెలుసని అన్నారు.
 
తూర్పుగోదావరి జిల్లాలో ల్యాటరైట్ గనుల్లో వైసీపీ నేతలు దోచుకున్నారన్నది అసత్యమన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. సరస్వతి పవర్ అంశంలో నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments