Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి ఒక్క పైసా ఇవ్వలేం : తేల్చి చెప్పి కేంద్ర ప్రభుత్వం

అసలే నిధుల కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై ఒక్క పైసా కూడా విడుదల చేయలేమని స్పష్టంచేసింది. ఇప్పటిదాకా కేటాయించి

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (09:28 IST)
అసలే నిధుల కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై ఒక్క పైసా కూడా విడుదల చేయలేమని స్పష్టంచేసింది. ఇప్పటిదాకా కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సరిపెట్టుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్టు సమాచారం పైగా ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల ముందు కేంద్రం వితండ వాదన చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ భేటీలో విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ను బయటకు తీసిన కేంద్రం... సదరు సెక్షన్ ప్రకారం రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని చెప్పింది. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. ఇది సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని కూడా కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల నోట మాట రాలేదట.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments