Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు షాక్... రాజధాని రైతులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు...

Webdunia
బుధవారం, 9 మార్చి 2016 (21:10 IST)
అసెంబ్లీలో హీట్ రేకెత్తించిన అమరావతి భూ సమీకరణ వ్యవహారంలో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టిన జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని రైతులు గట్టి షాకే ఇచ్చారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని లోని తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి మందడం గ్రామం వరకు జగన్ దిష్టిబొమ్మను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. 
 
ఈ ఊరేగింపులో 29 గ్రామాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఊరేగింపుగా వచ్చిన రైతులు జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలనీ, తమ వద్ద ప్రభుత్వం భూములను లాక్కోలేదనీ, తామే ఇష్టపూర్వకంగా ఇచ్చినట్లు తెలిపారు. అలాగే రాజధానికి ఇచ్చిన భూములు పోగా మిగిలిన భూములను తమకు అమ్ముకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే దానిని లేకుండా చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ వారు మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments