Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగని కరోనా దూకుడు... ఉప ముఖ్యమంత్రికి పాజిటివ్

Webdunia
సోమవారం, 10 మే 2021 (18:58 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్ద‌ సంఖ్య‌లో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల‌ను ఈ మ‌ధ్య‌ కాలంలో అధికంగా మ‌హ‌మ్మారి చుట్టుముడుతున్న‌ది. 
 
తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె భర్త పరిక్షిత్‌ రాజుకు కూడా ఇటీవ‌లే కరోనా సోకింది.
 
అలాగే, క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీదేవి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. 
 
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింద‌ని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments