Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగని కరోనా దూకుడు... ఉప ముఖ్యమంత్రికి పాజిటివ్

Webdunia
సోమవారం, 10 మే 2021 (18:58 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్ద‌ సంఖ్య‌లో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల‌ను ఈ మ‌ధ్య‌ కాలంలో అధికంగా మ‌హ‌మ్మారి చుట్టుముడుతున్న‌ది. 
 
తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె భర్త పరిక్షిత్‌ రాజుకు కూడా ఇటీవ‌లే కరోనా సోకింది.
 
అలాగే, క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీదేవి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. 
 
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింద‌ని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments