Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ నిర్ణయాలు కుల మూలాలకే ప్రమాదం : పవన్ కళ్యాణ్

వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (09:43 IST)
వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలకు నష్టం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల తమకు నష్టం జరుగుతోందని కృష్ణానది లంక గ్రామాలకు చెందిన రైతులు, పోలవరం మూల లంక రైతులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు పవన్‌కు వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు పరిధిలో స్పిల్‌వే నిర్మాణం నిమిత్తం తవ్వుతున్న మట్టి, రాళ్లను నేరుగా తాము సాగుచేసే భూముల్లో పోసి డంపింగ్‌ యార్డుగా మార్చేశారని, పరిహారం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా అనుసరిస్తోందని, ఫలితంగా బతుకులు నాశనమయ్యాయని మూల లంక రైతులు పవన్‌తో మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత రైతుల సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు తమ పార్టీ అండ ఉంటుందన్నారు. రెండు ప్రాంతాల్లోనూ త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments