Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ నిర్ణయాలు కుల మూలాలకే ప్రమాదం : పవన్ కళ్యాణ్

వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (09:43 IST)
వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలకు నష్టం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల తమకు నష్టం జరుగుతోందని కృష్ణానది లంక గ్రామాలకు చెందిన రైతులు, పోలవరం మూల లంక రైతులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు పవన్‌కు వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు పరిధిలో స్పిల్‌వే నిర్మాణం నిమిత్తం తవ్వుతున్న మట్టి, రాళ్లను నేరుగా తాము సాగుచేసే భూముల్లో పోసి డంపింగ్‌ యార్డుగా మార్చేశారని, పరిహారం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా అనుసరిస్తోందని, ఫలితంగా బతుకులు నాశనమయ్యాయని మూల లంక రైతులు పవన్‌తో మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత రైతుల సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు తమ పార్టీ అండ ఉంటుందన్నారు. రెండు ప్రాంతాల్లోనూ త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments