Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరా! రాజ‌ధాని మారింది ... ‘అమరావతి’ పాఠం తొలగింపు!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (10:07 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌, ఇక్క‌డ రాజ‌ధాని అనేది క‌ల‌గానే మిగిలిపోయింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్మించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విశ్వప్ర‌య‌త్నం చేశారు. తాత్కాలిక రాజ‌ధానిని తేగ‌లిగారేకాని, దాన్ని శాశ్వ‌తం చేయ‌లేక‌పోయారు. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానిగా పేర్కొని, విశాఖ‌, క‌ర్నూలు మ‌రో రెండు రాజ‌ధానుల‌ను సంక‌ల్పించారు. 
 
చంద్రబాబు హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని పాఠ్యాంశంగా చేర్చ‌గా, ఇపుడు దానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలగించింది. పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు.

తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి, 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేయడం కొస‌మెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments