Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (10:07 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) పరిధిలో నివాస ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా గురువారం లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ లాటరీలో పేర్లు వచ్చే రైతులకు సీఆర్డీయే ప్లాట్లను కేటాయించనుంది. 
 
ముఖ్యంగా సీఆర్డీయే పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్ల కోసం గురువారం ఈ-లాటరీని నిర్వహిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు. 
 
అమరావతి పరిధిలో 14 గ్రామాలలో రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగయపాళెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్ళూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments