Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (10:07 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) పరిధిలో నివాస ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా గురువారం లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ లాటరీలో పేర్లు వచ్చే రైతులకు సీఆర్డీయే ప్లాట్లను కేటాయించనుంది. 
 
ముఖ్యంగా సీఆర్డీయే పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్ల కోసం గురువారం ఈ-లాటరీని నిర్వహిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు. 
 
అమరావతి పరిధిలో 14 గ్రామాలలో రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగయపాళెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్ళూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments