ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి: రాఘవులు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (06:46 IST)
దేశంలో ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీ పాలనని దేశం మొత్తం వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎంబీ విజ్ఞాన కేంద్రలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీకి అవకాశం ఉన్నా ఏమీ చేయలేకపోతోందని చెప్పారు. దేశంలో ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పాటిస్తోందని తెలిపారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
 
మోదీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పారు. మరోవైపు పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. కరోనా విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కరోనా రావడంతో మోదీ ప్రభుత్వానికి సంతోషంగా ఉందన్నారు. ధరలు పెంచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతు సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్‌‌ను జయప్రదం చేయాలని రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అన్ని రకాల ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments