Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రావెల్స్ నడుపుతున్నారు.. అతి చేస్తే బస్సు ఎక్కనిస్తారా?: జేసీని నిలదీసిన కోర్టు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమానయాన సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (16:13 IST)
ఏపీలో అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమానయాన సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నతో దిమ్మతిరిగిపోయారు.
 
ఇటీవల విశాఖపట్టణంలో ఎయిర్‌పోర్టు సిబ్బందితో జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ప్రింటర్‌ను ఎత్తి కిందపడేసేందుకు పూనుకున్నారు. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ నిషేధం విధించాయి. 
 
ఈనేపథ్యంలో సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో జేసీ వెళ్లాల్సి వచ్చింది. ఓటు వేసిన తర్వాత తనపై విమానయాన సంస్థలు విధించిన నిషేధంపై జైట్లీతో జేసీ దివాకర్ రెడ్డి చర్చించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జైట్లీ సూచించారు. 
 
అయితే, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని... నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ హైద్రాబాద్ హైకోర్టును జేసీ ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. నిషేధాన్ని రద్దు చేయలేమని కోర్టు స్పష్టంచేసింది.
 
'మీరు జేసీ కూడా ట్రావెల్స్ నడుపుతున్నారు కదా... భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని బస్సులో ప్రయాణించడానికి అనుమతిస్తారా' అంటూ కోర్టు ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారంపై ఎయిర్‌లైన్స్ సంస్థలకు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు మళ్లీ విచారణకొచ్చే 21వ తేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments