Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన వాడే ప్రియుడు... మరొకతనితో రొమాన్స్... కాదన్నందుకు కోసేసింది....

పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చి

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:31 IST)
పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చిత్తూరు శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చనాయుడు కండ్రిగలో నివాసముంటున్న గుర్రప్ప, లక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రవళ్లిక అనే యువతితో గుర్రప్పకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ళ పాటు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఇద్దరూ కాపురం పెట్టి సహజీవనం కూడా చేశారు. 
 
ప్రవళ్లిక అనాధ. గుర్రప్పతో రెండు సంవత్సరాల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ప్రవళిక మరో ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పరచుకుంది. గుర్రప్పకు విషయం తెలియడంతో మందలించాడు. దీంతో ప్రవళ్లిక నిన్న రాత్రి గుర్రప్ప తన ఇంటిలో నిద్రిస్తుండగా మర్మాంగాలను కోసేసి గొంతు నులిపి చంపేసింది. ప్రస్తుతం ప్రవళ్లిక పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments