Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆర్థిక అవకతవకలు : సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను డిసెంబలు 14వ తేదీకి వాయిదా వేసింది. 
 
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటును ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘరామకృష్ణం రాజు తన పిటిషన్‌‍లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. 
 
మరోవైపు, పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు ఆలకించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ రెడ్డితో సహా పలువురు మంత్రు, అధికారులతో కలిసి మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 14వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments